రోడ్డు ప్రమాదంలో వరుడు, తల్లి దుర్మరణం

ABN , First Publish Date - 2022-02-17T16:04:44+05:30 IST

కోయంబత్తూరు సిడ్కోనగర్‌ వద్ద బుధవారం ఉదయం కారును లారీ ఢీకొన్న ప్రమాదంలో వరుడు, అతడి తల్లి మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కోయంబత్తూరు సుందరాపురానికి చెందిన సౌడయ్యన్‌, మంజుల దంపతుల

రోడ్డు ప్రమాదంలో వరుడు, తల్లి దుర్మరణం

చెన్నై: కోయంబత్తూరు సిడ్కోనగర్‌ వద్ద బుధవారం ఉదయం కారును లారీ ఢీకొన్న ప్రమాదంలో వరుడు, అతడి తల్లి మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కోయంబత్తూరు సుందరాపురానికి చెందిన సౌడయ్యన్‌, మంజుల దంపతుల కుమారుడు శ్యామ్‌ ప్రసాద్‌కు తేని జిల్లా బోడియనాయకనూరుకు చెందిన స్వాతి అనే యువతితో మూడు రోజులకు ముందు వివాహం జరిగింది. మూడు నిద్రల తర్వాత శ్యామ్‌ ప్రసాద్‌ భార్య స్వాతి, తల్లిదండ్రులతో కారులో బోడినాయకనూరులోని అత్తగారింటికి బుధవారం వేకువజామున కారులో బయలుదేరారు. కారును శ్యామ్‌ ప్రసాద్‌ నడిపాడు. ఆ కారు సిడ్కోనగర్‌ రహదారిలో వెళుతుండగా అదుపు తప్పిన లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో శ్యామ్‌ ప్రసాద్‌, అతడి తల్లి మంజుల ఆ స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. సౌడయ్యన్‌, స్వాతి తీవ్రంగా గాయపడ్డారు. కోయంబత్తూరు వెస్ట్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - 2022-02-17T16:04:44+05:30 IST