AP: లారీ - కారు ఢీ... ఒకరు మృతి

ABN , First Publish Date - 2022-04-26T13:30:44+05:30 IST

జిల్లాలోని మార్టూరు వద్ద జాతీయ రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు.

AP: లారీ - కారు ఢీ... ఒకరు మృతి

బాపట్ల: జిల్లాలోని మార్టూరు వద్ద  జాతీయ రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. లారీ, కారు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను స్ధానిక ఆస్పత్రికి తరలించారు. వీరంతా తిరుమల దైవదర్శనానికి వెళ్ళి తిరిగి స్వగ్రామం కృష్ణ జిల్లా జగ్గయ్య పేట వెళ్లుతుండగా ఘటన జరిగింది. మృతుడు జంగాల నరేష్(30)గా గుర్తించారు. కేసు నమోదు  చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 


Updated Date - 2022-04-26T13:30:44+05:30 IST