అక్టోబరు 2న గిరిజన వర్సిటీ శంకుస్థాపన: సీఎం
ABN , First Publish Date - 2020-08-10T10:05:18+05:30 IST
భిన్న సంస్కృతులకు ఆంధ్రప్రదేశ్ నిలయమని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివారం ఆయనతోపాటు తెలుగుదేశం పార్టీ
చంద్రబాబు, లోకేశ్ గిరిజన దినోత్సవ శుభాకాంక్షలు
అమరావతి, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): భిన్న సంస్కృతులకు ఆంధ్రప్రదేశ్ నిలయమని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివారం ఆయనతోపాటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు వేర్వేరుగా ట్విటర్లో, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఓ ప్రకటనలో గిరిజనులకు శుభాకాంక్షలు తెలిపారు. గాంధీ జయంతి(అక్టోబరు 2న) రోజే విజయనగరం జిల్లా కురుపాంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీ, పాడేరులో మెడికల్ కాలేజీ, ట్రైబల్ యూనివర్సిటీలకు శంకుస్థాపన చేస్తున్నామని జగన్ ట్వీట్ చేశారు.