దేవేందర్గౌడ్తో రేవంత్రెడ్డి భేటీ
ABN , First Publish Date - 2021-07-19T00:44:17+05:30 IST
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి దూకుడు పెంచారు. కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు ఆయన వ్యూహాలు రచిస్తున్నారు.
హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి దూకుడు పెంచారు. కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు ఆయన వ్యూహాలు రచిస్తున్నారు. గతంలో కాంగ్రెస్ నుంచి బయటకుపోయిన నేతలను తిరిగి స్వంత గూటికి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. టీఆర్ఎస్ అసంతృప్తి నేతలతో పాటు గతంలో టీడీపీలో పనిచేసిన నేతలను కూడా రేవంత్రెడ్డి కలుస్తున్నారు. వరుస భేటీలతో రేవంత్రెడ్డి బిజీబిజీగా ఉన్నారు. రేవంత్రెడ్డి వ్యూహాన్ని గమనిస్తున్న నేతలు.. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ను అధికారంలోకి రావడం ఖాయమని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే మాజీమంత్రి దేవేందర్ గౌడ్తో రేవంత్ భేటీ అయ్యారు.
అనంతరం రేవంత్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ దేవేందర్ గౌడ్ ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చామని తెలిపారు. ఆయన ఆలోచన తెలంగాణ ప్రజలకు ఉపయోగపడాలని ఆకాంక్షించారు. దేవేందర్ సలహాలు సూచనలు తీసుకుంటామని ప్రకటించారు. దారి తప్పిన తెలంగాణను పట్టాలు ఎక్కించాలంటే అనుభవం కావాలన్నారు. ఆయన సూచనలు తీసుకుని తెలంగాణ ప్రజల స్వేచ్ఛ కోసం పనిచేస్తామని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్లు కొల్లగొట్టినా పూర్తి కాలేదని రేవంత్ దుయ్యబట్టారు.