మంత్రి హరీష్రావుకు రేవంత్రెడ్డి లేఖ
ABN , First Publish Date - 2022-04-05T22:33:49+05:30 IST
మంత్రి హరీష్రావుకు రేవంత్రెడ్డి లేఖ
హైదరాబాద్: మంత్రి హరీష్రావుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి లేఖ రాశారు. 10 రోజులుగా నిమ్స్ కాంట్రాక్ట్ నర్సులు ఆందోళన చేస్తున్నా... ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. నర్సుల డిమాండ్లను హరీష్రావు పెడచెవిన పెట్టడం దుర్మార్గమన్నారు. నిమ్స్ కాంట్రాక్ట్ నర్సులకు ప్రసూతి సెలవులు, వేతన పే స్లిప్పులు ఇవ్వకపోవడం అన్యాయమన్నారు. ఇది కట్టు బానిసత్వం కిందకు వస్తుందన్నారు. హరీష్రావు స్వయంగా వెళ్లివారితో చర్చలు జరపాలని లేఖలో పేర్కొన్నారు. నర్సుల కనీస డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.