పేద పిల్లల చదువులకు ‘చంద్ర’గ్రహణం పట్టింది: Revanth

ABN , First Publish Date - 2022-07-13T17:29:23+05:30 IST

తెలంగాణ(Telangana)లో పేద పిల్లల చదువుకు ‘చంద్ర’గ్రహణం పట్టిందని టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి(Revanth Reddy) ట్విటర్(Twitter) వేదికగా

పేద పిల్లల చదువులకు ‘చంద్ర’గ్రహణం పట్టింది: Revanth

Hyderabad : తెలంగాణ(Telangana)లో పేద పిల్లల చదువుకు ‘చంద్ర’గ్రహణం పట్టిందని టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి(Revanth Reddy) ట్విటర్(Twitter) వేదికగా విమర్శించారు. ప్రశ్నించకపోతే తెలంగాణ అజ్ఞానాంధకారంలోకి వెళ్లడం ఖాయమని ఆయన పేర్కొన్నారు. ‘‘తెలంగాణలో పేద పిల్లల చదువులకు ‘చంద్ర’గ్రహణం పట్టింది. ఉపాధ్యాయులు లేక, పాఠ్యపుస్తకాలు లేక పాఠశాలలు వెలవెలబోతున్నాయి. ‘మన ఊరు - మన బడి’ ఓ ప్రచారార్భాటం. ప్రశ్నించకపోతే తెలంగాణ అజ్ఞానాంధకారంలోకి వెళ్లడం ఖాయం’’ అని రేవంత్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

Updated Date - 2022-07-13T17:29:23+05:30 IST