మూడో వేవ్ చిన్నారులపై త్రీవ ప్రభావం చూపుతుంది: రేవంత్
ABN , First Publish Date - 2021-05-18T17:18:08+05:30 IST
దేశంలో కారోనా మూడో వేవ్ చిన్నారులపై త్రీవ ప్రభావం చూపనుందని ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు.
హైదరాబాద్: దేశంలో కారోనా మూడో వేవ్ చిన్నారులపై త్రీవ ప్రభావం చూపనుందని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వైద్య సదుపాయాలు మెరుగు పరుచుకోవడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. మూడో వేవ్ను ఎదుర్కొనేందుకు అవరసమైన మందులు, వైద్య సిబ్బంది, నర్సింగ్ స్టాఫ్కు ట్రైనింగ్ ఇవ్వాలన్నారు. ‘నేటి చిన్నారులే రేపటి మన దేశ భవిష్యత్తు.. వారి ఆరోగ్య సంరక్షణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని’ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.