ఏపీ పేరును 'వైఎస్సార్ ప్రదేశ్'గా మార్చండి : రిటైర్డ్ ఐపీఎస్
ABN , First Publish Date - 2022-05-25T16:14:10+05:30 IST
రిటైర్డ్ ఐపీఎస్ ఎం.నాగేశ్వరరావు ట్విటర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ పేరును 'వైఎస్సార్ ప్రదేశ్'గా మార్చాలంటూ సీఎం జగన్ను కోరారు.
అమరావతి : రిటైర్డ్ ఐపీఎస్ ఎం.నాగేశ్వరరావు ట్విటర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ పేరును 'వైఎస్సార్ ప్రదేశ్'గా మార్చాలంటూ సీఎం జగన్ను కోరారు. తెలుగును ఓ తెగులుగా భావించి దానిని పీకిపారవేస్తున్నాం కాబట్టి.. రాష్ట్రానికి 'YSR LAND' అనే ఇంగ్లీష్ పేరు పెడితే భేషుగ్గా ఉంటుందని నాగేశ్వరరావు పేర్కొన్నారు. ‘‘ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం పేరును “వైయస్సార్ ప్రదేశ్” గా మార్చమని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారికి నా విన్నపం. మరో మాట: తెలుగును ఓ తెగులుగా భావించి దానిని పీకి పార వేస్తున్నాం కాబట్టి, రాష్ట్రానికి “YSR Land” అనే ఇంగ్లీషు పేరు పెడితే మరీ భేషుగ్గా ఉంటుంది’’ అని పేర్కొన్నారు.