ఓటరు కార్డు-ఆధార్‌ అనుసంధానానికి స్పందన

ABN , First Publish Date - 2022-08-06T09:10:59+05:30 IST

ఓటరు కార్డుకు ఆధార్‌ అనుసంధానంపై పౌరుల్లో స్పందన క్రమంగా పెరుగుతోందని, రాష్ట్రవ్యాప్తంగా 5 రోజుల్లో 20 వేల మంది ఆధార్‌ లింక్‌ చేసుకున్నట్లు ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) వికాస్‌రాజ్‌ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.

ఓటరు కార్డు-ఆధార్‌ అనుసంధానానికి స్పందన

  • 5 రోజుల్లో 20 వేల మంది నమోదు
  • రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్‌ 

 హైదరాబాద్‌, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): ఓటరు కార్డుకు ఆధార్‌ అనుసంధానంపై పౌరుల్లో స్పందన క్రమంగా పెరుగుతోందని, రాష్ట్రవ్యాప్తంగా 5 రోజుల్లో 20 వేల మంది ఆధార్‌ లింక్‌ చేసుకున్నట్లు ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) వికాస్‌రాజ్‌ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఓటర్లు స్వచ్ఛందంగా నమోదు చేసుకుంటున్నందు వల్ల ఆధార్‌  వివరాల గోప్యతపై జిల్లాల కలెక్టర్లు ప్రత్యేక దృష్టిసారించినట్లు చెప్పారు. రాష్ట్రంలో కొత్తగా ఓటరు నమోదుతోపాటు చిరునామా, నియోజకవర్గాల్లో మార్పు ప్రక్రియను కూడా ప్రజలు వినియోగించుకుంటున్నట్లు ఆయన తెలిపారు. 

Updated Date - 2022-08-06T09:10:59+05:30 IST