బార్కు వెళ్లిన 85 మందికి కరోనా.. మిచిగాన్లో..
ABN , First Publish Date - 2020-06-28T07:47:37+05:30 IST
అమెరికాలో ఓ బార్కు వెళ్లిన వారిలో 85 మందికి కరోనా సోకినట్టు తెలియడంతో
లాన్సింగ్: అమెరికాలో ఓ బార్కు వెళ్లిన వారిలో 85 మందికి కరోనా సోకినట్టు తెలియడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మిచిగాన్లోని ఇంగమ్ కౌంటీలోని హార్పర్స్ రెస్టారెంట్ అండ్ బ్రూ పబ్కు జూన్ 12 నుంచి 20 మధ్య వెళ్లిన వారందరూ సెల్ప్ క్వారంటైన్కు వెళ్లాని అధికారులు ఆదేశించారు. ఈ సమయంలో బార్కు వెళ్లిన వారిలో 85 మందికి కరోనా పాజిటివ్ అని తేలిందని.. ఈ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండొచ్చని అన్నారు. ఈ సమయంలో బార్కు వెళ్లిన వారి వివరాలను కనుగొనే పనిలో అధికారులు పడ్డారు. వారి వల్ల కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువగా ఉందని అధికారులు పేర్కొన్నారు. మరోపక్క ప్రభుత్వం చెప్పిన అన్ని నిబంధనలను బార్ యాజమాన్యం పాటించినట్టు తెలుస్తోంది. అయినప్పటికి కరోనా వ్యాప్తి చెందడంతో బార్ యాజమాన్యం తాత్కాలికంగా తమ వ్యాపారాన్ని నిలిపివేసింది. ఎయిర్ ప్యూరిఫయింగ్ టెక్నాలజీని పెడుతున్నామని.. మరిన్ని జాగ్రత్తలతో త్వరలోనే తిరిగి వ్యాపారం మొదలుపెట్టనున్నట్టు బార్ యాజమాన్యం ఫేస్ బుక్ ద్వారా తెలియజేసింది.