రేపల్లె ఘటన బాధాకరం: హోంమంత్రి వనిత
ABN , First Publish Date - 2022-05-02T20:47:14+05:30 IST
రేపల్లె రైల్వేస్టేషన్ ఘటన బాధాకరమని హోంమంత్రి వనిత అన్నారు.
ప్రకాశం: రేపల్లె రైల్వేస్టేషన్ ఘటన బాధాకరమని హోంమంత్రి వనిత అన్నారు. సోమవారం వనిత మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఘటనకు పాల్పడ్డ ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశామన్నారు.బాధితురాలికి ప్రభుత్వం తరపున అన్నిరకాల పరిహారాలు అందజేస్తామన్నారు.అత్యాచార బాధితుల వివరాలపై గోప్యత పాటించాలని చెప్పారు. ప్రతిపక్షాలు కావాలనే ఇలాంటి ఘటనలపై రాద్ధాంతం చేస్తున్నాయని హోంమంత్రి వనిత మండిపడ్డారు.