Renuka Choudhary సీఎం జగన్ది మూర్కపు పాలన...
ABN , First Publish Date - 2022-09-12T18:20:19+05:30 IST
అమరావతి రైతుల వెయ్యి రోజుల ఉద్యమం ఓ చరిత్ర అని మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి అన్నారు.
అమరావతి (Amaravathi): అమరావతి రైతుల వెయ్యి రోజుల ఉద్యమం ఓ చరిత్ర అని కాంగ్రెస్ నాయకురాలు, మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి (Renuka Choudhary) అన్నారు. సోమవారం ఆమె ఏబీఎన్ ఆంధ్రజ్యోతి (ABN Andhrajyothy)తో మాట్లాడుతూ రైతులకు మద్దతుగా అప్పుడు వచ్చానని.. ఇప్పుడూ వచ్చానని.. మళ్లీ వస్తానని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి జగన్ (CM Jagan) మూర్కపుపాలన చేస్తున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు. ఏపీ రాజధానిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) శంకుస్థాపన చేసిన ప్రాంతం అమరావతికి అండగా నిలబడతామని చెప్పిన ఆయన ఇప్పుడు ఏమయ్యారని రేణుకా చౌదరి ప్రశ్నించారు.