మళ్లీ రిలయన్సే!
ABN , First Publish Date - 2020-12-02T06:19:04+05:30 IST
ఆసియా కుబేరుడు ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) మరో ఘనత దక్కించుకుంది. ఫార్చ్యూన్ ఇండియా-500 జాబితాలో కంపెనీకి వరుసగా రెండో ఏడాదీ అగ్రస్థానం లభించింది...
- ఫార్చ్యూన్ ఇండియా-500
- లిస్ట్లో మళ్లీ అగ్రస్థానం
ముంబై: ఆసియా కుబేరుడు ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) మరో ఘనత దక్కించుకుంది. ఫార్చ్యూన్ ఇండియా-500 జాబితాలో కంపెనీకి వరుసగా రెండో ఏడాదీ అగ్రస్థానం లభించింది. ఈ లిస్ట్లోని కంపెనీల మొత్తం ఆదాయంలో రిలయన్స్ వాటా 7 శాతం కాగా.. లాభాల్లో 11 శాతంగా ఉంది.
గత ఏడాది విడుదలైన జాబితాలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ)ను వెనక్కినెట్టి రిలయన్స్ తొలిసారిగా నెం.1 స్థానానికి చేరుకుం ది. వార్షికాదాయం, లాభాల ఆధారంగా దేశంలోని 500 పెద్ద కంపెనీలకు ఫార్చ్యూన్ ర్యాంకింగ్స్ కేటాయిస్తుంది. 2019- 20 సంవత్సరం ఆధారంగా ఈ జాబితాను విడుదల చేసింది.