వీశాట్ ఫలితాలు విడుదల.. 10 నుంచి కౌన్సెలింగ్
ABN , First Publish Date - 2020-06-07T09:29:59+05:30 IST
బీటెక్, బీ ఫార్మశీల్లో ప్రవేశాల కోసం విజ్ఞాన్ విశ్వవిద్యాలయం నిర్వహించిన విశాట్ 2020 ఫలితాలను వర్సిటీ ఉపకులపతి ఎంవైఎస్ ప్రసాద్ విడుదల చేశారు. గుంటూరు సమీపంలోని వడ్లమూడి విజ్ఞాన్ విశ్వవిద్యాలయంలో ఫలితాలు
గుంటూరు(విద్య), జూన్ 6: బీటెక్, బీ ఫార్మశీల్లో ప్రవేశాల కోసం విజ్ఞాన్ విశ్వవిద్యాలయం నిర్వహించిన విశాట్ 2020 ఫలితాలను వర్సిటీ ఉపకులపతి ఎంవైఎస్ ప్రసాద్ విడుదల చేశారు. గుంటూరు సమీపంలోని వడ్లమూడి విజ్ఞాన్ విశ్వవిద్యాలయంలో ఫలితాలు విడుదల చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. గతేడాది కంటే ఈ ఏడాది పరీక్షకు 20 శాతం ఎక్కువ మంది విద్యార్థులు హాజరయ్యారని వీసీ పేర్కొన్నారు. విద్యార్థుల ర్యాంకుల ఆధారంగా జూన్ 10 నుంచి ఆన్లైన్ కౌన్సెలింగ్ నిర్వహిస్తామని తెలిపారు. వీశాట్లో 1 నుంచి 100లోపు ర్యాంకులు సాధించిన వారికి 75 శాతం స్కాలర్షిప్, 100 నుంచి 200లోపు ర్యాంకులు వచ్చిన వారికి 50 శాతం, 201 నుంచి 400లోపు ర్యాంకులు వచ్చిన వారికి 25 శాతం, అదే విధంగా 401 నుంచి 2 వేలలోపు ర్యాంకు వారికి 10 శాతం స్కాలర్షిప్ కల్పిస్తామని తెలిపారు.