మెడికల్ యూజీ ప్రవేశాలకు ప్రకటన విడుదల
ABN , First Publish Date - 2022-01-29T02:16:40+05:30 IST
రాష్ట్రంలో మెడికల్, డెంటల్ యూజీ ప్రవేశాలకు ప్రభుత్వం ప్రకటన
అమరావతి: రాష్ట్రంలో మెడికల్, డెంటల్ యూజీ ప్రవేశాలకు ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. 2021-22 ఏడాది ప్రవేశాల కోసం నోటిఫికేషన్ను అధికారులు జారీ చేశారు. కాంపిటెంట్ ఆథారిటీ కోటా ప్రవేశాలకు కూడా నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ను వెలువరించారు. నీట్లో అర్హత సాధించినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ నెల 29 నుంచి ఫిబ్రవరి 4 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు పేర్కొన్నారు.