రాధాను హత్య చేసేందుకు రెక్కీ చేసిన మాట వాస్తవం: చంద్రబాబు

ABN , First Publish Date - 2022-01-01T23:59:28+05:30 IST

టీడీపీ నేత రాధా నివాసానికి ఆ పార్టీ అధినేత చంద్రబాబు వెళ్లారు. రాధాను చంద్రబాబు పరామర్శించారు.

రాధాను హత్య చేసేందుకు రెక్కీ చేసిన మాట వాస్తవం: చంద్రబాబు

అమరావతి: టీడీపీ నేత రాధా నివాసానికి ఆ పార్టీ అధినేత చంద్రబాబు వెళ్లారు. రాధాను చంద్రబాబు పరామర్శించారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ రాధాపై రెక్కీ నిర్వహించిన తర్వాత ఆయన భద్రతపై డీజీపీకి లేఖ రాశానని తెలిపారు. సీసీ కెమెరాల ఆధారంగా దోషులను పట్టుకునే అవకాశం ఉందని, ఇంత వరకు పోలీసులు ఏమీ చెప్పలేదని తప్పుబట్టారు. ఈ ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిణగించాలని, దోషులు ఎవరో తేల్చాలని డిమాండ్ చేశారు. తాను రాసిన లేఖ ఆధారంగా విచారణ చేయాలన్నారు. దోషులను కాపాడే ప్రయత్నం జరుగుతోందని అనుమానం వ్యక్తం చేశారు. రెక్కీ చేసిన మాట వాస్తవమని, సీసీ కెమెరాల్లో విజువల్స్ ఉన్నాయా.. లేదా..? అని చంద్రబాబు ప్రశ్నించారు. ఎందుకు కాలయాపన చేస్తున్నారని నిలదీశారు. గన్‌మెన్లను ఇచ్చి చేతులు దులుపుకుందాం అనుకున్నారని చంద్రబాబు విమర్శించారు.

Updated Date - 2022-01-01T23:59:28+05:30 IST