ఫైనల్లో ‘రికర్వ్‌’ మహిళలు

ABN , First Publish Date - 2022-06-24T09:19:22+05:30 IST

భారత రికర్వ్‌ విభాగం మహిళలు ప్రపంచ కప్‌ మూడో దశ పోటీల్లో ఫైనల్‌కు దూసుకుపోయారు.

ఫైనల్లో ‘రికర్వ్‌’ మహిళలు

ప్రపంచ కప్‌ ఆర్చరీ

పారిస్‌ : భారత రికర్వ్‌ విభాగం మహిళలు ప్రపంచ కప్‌ మూడో దశ పోటీల్లో ఫైనల్‌కు దూసుకుపోయారు. దీపికా కుమారి, అంకితా భక్త్‌, సిమ్రన్‌జీత్‌ కౌర్‌ త్రయం ఉక్రెయిన్‌, బ్రిటన్‌, టర్కీ జట్లను చిత్తు చేసి తుదిపోరుకు చేరింది. తద్వారా ఈ వరల్డ్‌ కప్‌లో దేశానికి  పతకాన్ని ఖాయం చేసింది. ఆదివారం జరిగే ఫైనల్లో మూడో సీడ్‌ తైపీ జట్టుతో భారత మహిళలు అమీతుమీ తేల్చుకోనున్నారు. నాలుగో సీడ్‌ ఉక్రెయిన్‌ను 5-1తో ఓడించి శుభారంభం చేసిన మన మహిళల రికర్వ్‌ జట్టు క్వార్టర్స్‌లో 6-0లో గ్రేట్‌ బ్రిటన్‌ను చిత్తు చేసింది. ఇక ఉత్కంఠభరితంగా జరిగిన సెమీ్‌సలో 5-3తో టర్కీపై నెగ్గింది. కాగా భారత పురుషుల రికర్వ్‌ జట్టు తొలిరౌండ్‌లోనే స్విట్జర్లాండ్‌ చేతిలో ఓటమితో నిష్క్రమించింది.

Updated Date - 2022-06-24T09:19:22+05:30 IST