ఆ 2వేల కోట్ల దోపిడీ వెనుక ఉన్న.. ముఠా నాయకుడు ఎవరు?: రేవంత్రెడ్డి
ABN , First Publish Date - 2022-04-10T19:17:26+05:30 IST
టీఆర్ఎస్ ప్రభుత్వం, మంత్రి కేటీఆర్పై టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి ట్విటర్లో తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వం, మంత్రి కేటీఆర్పై టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి ట్విటర్లో తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. హైదరాబాద్ నడిబొడ్డున రూ.2వేల కోట్ల దోపిడీ వెనుక ఉన్న ముఠా నాయకుడు ఎవరు? అని ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్కు తెలియకుండా ఈ దోపిడీ సాధ్యమా? అని నిలదీశారు. కేసీఆర్ ఆదేశాలు లేకుండా.. సీఎస్, మున్సిపల్ కమిషనర్ ఇంతలా బరితెగించగలరా? అని ప్రశ్నించారు. సర్వే నెంబర్.327లో లేఔట్ అనుమతులు రద్దు చేయాలని రేవంత్రెడ్డి డిమాండ్ చేశారు.