సీఎం కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

ABN , First Publish Date - 2022-02-22T22:07:34+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. మీ ప్రభుత్వంలో వీఆర్ఒల పరిస్థితి కట్టు బానిసల కంటే హీనంగా తయారైందన్నారు. గొడ్డు చాకిరీ చేయించుకుని...

సీఎం కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. మీ ప్రభుత్వంలో వీఆర్ఒల పరిస్థితి కట్టు బానిసల కంటే హీనంగా తయారైందన్నారు. గొడ్డు చాకిరీ చేయించుకుని... వాళ్ల హక్కులను కాలరాస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. చాలీ చాలని జీతాలు ... ఏళ్ల తరబడి ప్రమోషన్లు లేక వీఆర్ఒల పరిస్థితి దుర్భరంగా ఉందన్నారు. వీఆర్ఒల కు పే స్కేల్ అమలు చేస్తామని అసెంబ్లీ సాక్షిగా హామీ ఏళ్లు గడుస్తున్నా అమలు చేయలేదని తెలిపారు. హామీలు ఇవ్వడం తప్ప... అమలు చేయాలన్న సోయి లేదన్నారు. శేషాద్రి కమిటీ ఓ కంటి తుడుపు చర్య అన్నారు. వీఆర్ఒలకు తక్షణం పే స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే అర్హులైన వీఆర్ఒలకు పదోన్నతులు కల్పించాలన్నారు. వాళ్లకు సొంత గ్రామాలలో డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టించి ఇవ్వాలని ఆయన లేఖలో పేర్కొన్నారు. విధి నిర్వహణలో చనిపోయిన వీఆర్ఒల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. 

Updated Date - 2022-02-22T22:07:34+05:30 IST