సౌత్..సో బెటర్!
ABN , First Publish Date - 2021-02-17T09:02:32+05:30 IST
ప్రవాస భారతీయులు (ఎన్ఆర్ఐ) దక్షిణాది రాష్ట్రాల్లో రియల్టీ పెట్టుబడులకు అమితాసక్తి కనబరుస్తున్నారని కామన్ఫ్లోర్ తాజా నివేదిక వెల్లడించింది. అమెరికా, బ్రిటన్,
రియల్టీ పెట్టుబడులకు దక్షిణాదిపైనే ప్రవాసుల ఆసక్తి
వీరి సెర్చ్ల్లో 75% ఇక్కడే..
ఏపీపైన మాత్రం అనాసక్తి!
మొత్తం శోధనల్లో 9 శాతం తెలంగాణ మార్కెట్లో..
ముంబై: ప్రవాస భారతీయులు (ఎన్ఆర్ఐ) దక్షిణాది రాష్ట్రాల్లో రియల్టీ పెట్టుబడులకు అమితాసక్తి కనబరుస్తున్నారని కామన్ఫ్లోర్ తాజా నివేదిక వెల్లడించింది. అమెరికా, బ్రిటన్, యూఏఈల్లో నివసిస్తున్న ప్రవాసుల్లో 75 శాతం దక్షిణాది రియల్టీ మార్కెట్లలో పెట్టుబడి అవకాశాలకోసమే శోధిస్తున్నారని తెలిపింది. ఆంధ్రప్రదేశ్కు చెందిన వేలాది మంది టెకీలు విదేశాల్లో పనిచేస్తున్నప్పటికీ.. ఎన్ఆర్ఐ శోధనల్ల్లో ఆ రాష్ట్రం లేకపోవడం గమనార్హమని నివేదిక పేర్కొంది.