మమ్నల్నీ ఆదుకోండి: రియల్టర్లు
ABN , First Publish Date - 2021-05-06T06:34:35+05:30 IST
కరోనా సంక్షోభకాలంలో రియల్ ఎస్టేట్ రంగానికీ రుణ పునర్వ్యవస్థీకరణ, వడ్డీ చెల్లింపులపై మారటోరియం, అదనపు ద్రవ్య మద్దతు చర్యలు ప్రకటించాలని ఆర్బీఐని క్రెడాయ్, నరెడ్కో కోరాయి...
న్యూఢిల్లీ: కరోనా సంక్షోభకాలంలో రియల్ ఎస్టేట్ రంగానికీ రుణ పునర్వ్యవస్థీకరణ, వడ్డీ చెల్లింపులపై మారటోరియం, అదనపు ద్రవ్య మద్దతు చర్యలు ప్రకటించాలని ఆర్బీఐని క్రెడాయ్, నరెడ్కో కోరాయి.
సెన్సెక్స్కు ఆర్బీఐ బూస్ట్
ఆర్బీఐ ప్రకటించిన తాజా ఊరట చర్యలు స్టాక్ మార్కెట్లో మూడ్రోజుల వరుస నష్టాలకు అడ్డుకట్టవేశాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, ఫార్మా, ఐటీ రంగాల్లో కొనుగోళ్ల మద్దతుతో ప్రామాణిక స్టాక్ సూచీలు లాభాల్లో పయనించాయి. బీఎ్సఈ సెన్సెక్స్ 424.04 పాయింట్లు బలపడి 48,677.55 వద్ద ముగిసింది. ఎన్ఎ్సఈ నిఫ్టీ 121.35 పాయింట్లు పెరిగి 14,617.85 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ లిస్టెడ్ కంపెనీల్లో 5.94 శాతం లాభంతో సన్ఫార్మా టాప్ గెయినర్గా నిలిచింది.