55 అంగుళాల టీవీని భారత్లో లాంచ్ చేసేందుకు సిద్ధమైన రియల్మీ
ABN , First Publish Date - 2020-06-03T00:38:27+05:30 IST
చైనీస్ స్మార్ట్ఫోన్ మేకర్ రియల్మీ త్వరలో భారత్లో 55 అంగుళాల టీవీని లాంచ్ చేయబోతోంది. రియల్మీ ఇప్పటికే
న్యూఢిల్లీ: చైనీస్ స్మార్ట్ఫోన్ మేకర్ రియల్మీ త్వరలో భారత్లో 55 అంగుళాల టీవీని లాంచ్ చేయబోతోంది. రియల్మీ ఇప్పటికే 32 అంగుళాలు, 43 అంగుళాల టెలివిజన్లను విడుదల చేసింది. వీటి ధర వరుసగా రూ. 12,999, రూ. 21,999 మాత్రమే. రియల్మీ 32 అంగుళాల టీవీ హెచ్డీ రిజల్యూషన్కు సపోర్ట్ చేస్తుండగా, 43 అంగుళాల టీవీ ఫుల్ హెచ్డీకి సపోర్ట్ చేస్తుంది. ఇటీవల వీటి విక్రయాలు ప్రారంభించగా పది నిమిషాల్లోనే అవుటాప్ స్టాక్ అయ్యాయి.
రియల్మీ సీఈవో మాధవ్ సేథ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 55 అంగుళాల టీవీని మార్కెట్లోకి తీసుకురాబోతున్నట్టు చూచాయగా చెప్పారు. ఇందులో ప్రీమియం, ఫ్లాగ్షిప్ టీవీలు ఉన్నట్టు పేర్కొన్నారు. అయితే, అంతకుమించిన వివరాలు వెల్లడించేందుకు నిరాకరించారు.