భారత్లో మూడు ఫోన్లను లాంచ్ చేసిన రియల్మి
ABN , First Publish Date - 2020-09-21T23:11:09+05:30 IST
నర్జో సిరీస్లో రియల్మి మరో మూడు ఫోన్లను భారత్లో విడుదల చేసింది. రియల్మి నర్జో 20, నర్జో 20ఎ, నర్జో 20 ప్రొలను లాంచ్
న్యూఢిల్లీ: నర్జో సిరీస్లో రియల్మి మరో మూడు ఫోన్లను భారత్లో విడుదల చేసింది. రియల్మి నర్జో 20, నర్జో 20ఎ, నర్జో 20 ప్రొలను లాంచ్ చేసింది. నర్జో 20, నర్జో 20ఎలు వాటర్ డ్రాప్ స్టైల్ డిస్ప్లే నాచ్లో రాగా, నర్జో 20 ప్రొ హోల్పంచ్ డిజైన్లో వచ్చింది. అలాగే, తొలి రెండు ఫోన్లలో ట్రిపుల్ రియర్ కెమెరాలను అమర్చగా, మూడో దాంట్లో క్వాడ్ కెమెరా సెటప్ ఉంది.
రియల్మి నర్జో 20 4జీబీ ర్యామ్+64 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.10,499 కాగా, 128 జీబీ వేరియంట్ ధర రూ.11,499 మాత్రమే. రియల్మి నర్జో20 ఎ 3జీబీ ర్యామ్+32జీబీ స్టోరేజీ ఆప్షన్ ధర రూ. 8,499 కాగా, 4జీబీ ర్యామ్+64 జీబీ స్టోరేజీ ఆప్షన్ ధర రూ.9,499. ఇక, రియల్మి నర్జో 20 ప్రో 6జీబీ ర్యామ్+64 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.14,999. హై ఎండ్ వేరియంట్ అయిన 8జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజీ మోడల్ ధర రూ. 16,999 మాత్రమే.