టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆర్సీబీ
ABN , First Publish Date - 2021-04-10T00:39:03+05:30 IST
ఐపీఎల్ 2021 మొదలైంది. చెన్నై వేదికగా జరుగుతున్న తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. కాగా.. టాస్ గెలిచిన బెంగళూరు ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ అనంతరం ఆర్సీబీ కెప్టెన్ కోహ్లీ మాట్లాడుతూ....
చెన్నై: ఐపీఎల్ 2021 మొదలైంది. చెన్నై వేదికగా జరుగుతున్న తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. కాగా.. టాస్ గెలిచిన బెంగళూరు ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ అనంతరం ఆర్సీబీ కెప్టెన్ కోహ్లీ మాట్లాడుతూ.. తాను టాస్ గెలవడం నమ్మలేకపోతున్నానని అన్నాడు. అలాగే ముంబై ఛేజింగ్లో అద్భుతంగా ఆడుతుందని, అందువల్ల తామే ఫీల్డింగ్ ఎంచుకుంటున్నామని కోహ్లీ చెప్పాడు. అలాగే ఆర్సీబీ తరపున మ్యాక్స్ వెల్, డేనియల్ క్రిస్టియన్ బరిలోకి దిగుతున్నారని, అతడితో పాటు తొలి సారి ఐపీఎల్ ఆడుతున్న కైల్ జేమిసన్ను కూడా బరిలోకి దింపుతున్నామని చెప్పాడు. అయితే పడిక్కల్ను మాత్రం జట్టులోకి తీసుకోలేదని, కోవిడ్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకున్నాడు కనుక అతడికి మరికొంత విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపాడు.