దూకుడుగా ఆడుతున్న ఫించ్ ఔట్
ABN , First Publish Date - 2020-09-29T01:49:12+05:30 IST
ముంబైతో జరుగుతున్న మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తొలి వికెట్ కోల్పోయింది. దీంతో 81 పరుగుల తొలివికెట్ భాగస్వామ్యానికి
దుబాయ్: ముంబైతో జరుగుతున్న మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తొలి వికెట్ కోల్పోయింది. దీంతో 81 పరుగుల తొలివికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ఆది నుంచే దూకుడుగా ఆడిన ఓపెనర్ ఫించ్ 31 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్తో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో బౌల్ట్ బౌలింగ్లో భారీ షాట్కు యత్నించిన ఫించ్ లాంగ్ ఆఫ్లో పొలార్డ్కు దొరికిపోయాడు. మొత్తం 35 బంతులు ఆడిన ఫించ్ 52 పరుగులు చేశాడు. ప్రస్తుతం పది ఓవర్లు ముగిశాయి. బెంగళూరు వికెట్ నష్టానికి 85 పరుగులు చేసింది. దేవదత్ పడిక్కల్ 25, విరాట్ కోహ్లీ ఒక పరుగుతో క్రీజులో ఉన్నారు.