పోలీస్ కుటుంబంలో దారుణం! కోడలిపై మామ అత్యాచారం! విషయం భర్తకు తెలిసి..
ABN , First Publish Date - 2021-06-27T20:27:12+05:30 IST
కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్న ఓ మహిళపై అదే శాఖలో పనిచేస్తున్న ఆమె మామ అత్యాచారానికి పాల్పడ్డాడు. జరిగిన దారుణం గురించి భర్తకు చెబితే..అతడు అదే కారణం చెప్పి నిషేధిత త్రిపుల్ తలాఖ్ ఇచ్చేశాడు.
లక్నో: ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ పోలీస్ కుటుంబంలో దారుణం చోటుచేసుకుంది. కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్న ఓ మహిళపై అదే శాఖలో పనిచేస్తున్న ఆమె మామ అత్యాచారానికి పాల్పడ్డాడు. జరిగిన దారుణం గురించి భర్తకు చెబితే..అతడు అదే కారణం చెప్పి నిషేధిత త్రిపుల్ తలాఖ్ ఇచ్చేశాడు. మీరట్ జిల్లాలో ఈ హృదయవిదారక ఘటన జరిగింది. బాధితురాలు మీరట్లోని ఓ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నారు. ఆమె భర్త అబిద్ కూడా ఓ పోలీస్ అధికారి కాగా.. అతడి తండ్రి అయిన నజీర్ అహ్మద్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్లో ఉన్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో మామ ఈ దారుణానికి పాల్పడ్డాడని బాధితురాలు ఆరోపించింది. అత్యాచారం గురించి ఎవరీకైనా చెబితే చంపేస్తానంటూ మామ బెదిరించాడని, సాయం కోసం భర్తను ఆశ్రయిస్తే అతడు తనకు త్రిపుల్ తలాఖ్ ఇచ్చేశాడని ఆమె ఆరోపించింది. దీంతో.. నిందితుడు నజీర్పైనా, బాధితురాలి భర్త అబీద్పైనా పోలీసులు కేసు నమోదు చేశారు. అబీద్తో తనకు మూడేళ్ల క్రితం వివాహమైందని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కోడలిగా కొత్త జీవితంలోకి అడుగుపెట్టి నాటి నుంచీ అత్తింటివారు తనను అదనపు కట్నం కోసం వేధించేవారిని ఆమె పేర్కొంది.