అత్యాచార నిందితుడికి రెండోసారి పరీక్షలో కరోనా నెగిటివ్
ABN , First Publish Date - 2020-05-12T16:37:45+05:30 IST
అత్యాచారం కేసులో నిందితుడైన తిహార్ జైలు అండర్ ట్రయల్ ఖైదీతోతోపాటు ముగ్గురికి కరోనా పాజిటివ్ అని రావడంతో జైలు అధికారులు వారిని క్వారంటైన్ కు తరలించారు....
న్యూఢిల్లీ : అత్యాచారం కేసులో నిందితుడైన తిహార్ జైలు అండర్ ట్రయల్ ఖైదీతోతోపాటు ముగ్గురికి కరోనా పాజిటివ్ అని రావడంతో జైలు అధికారులు వారిని క్వారంటైన్ కు తరలించారు. అత్యాచారానికి గురైన మహిళకు కరోనా పాజిటివ్ అని పరీక్షల్లో రావడంతో ఆమెపై అత్యాచారం చేసిన నిందితుడైన ఖైదీకి కూడా కరోనా లక్షణాలున్నాయని గుర్తించారు. అతన్ని పరీక్షించగా మొదట కరోనా పాటిటివ్ అని పరీక్షల్లో తేలింది. దీంతో సదరు ఖైదీతోపాటు అదే సెల్ లో ఉన్న మరో ఇద్దరు ఖైదీలకు కరోనా సోకిందని క్వారంటైన్ చేశారు. ముగ్గురు ఖైదీలకు మరోసారి పరీక్షించగా వారికి కరోనా నెగిటివ్ అని తేలింది.