RangaReddy: బైక్ను ఢీకొన్న కారు... వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2022-06-09T16:51:55+05:30 IST
జిల్లాలోని షాద్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారి బైపాస్ రోడ్డులో గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు.
రంగారెడ్డి: జిల్లాలోని షాద్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారి బైపాస్ రోడ్డులో గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. బైక్ను కారు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. బైక్పై వెళ్తున్న వ్యక్తి తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.