జీవో 317 అమలుపై ప్రభుత్వం పునరాలోచించాలి: రాంరెడ్డి దామోదర్‌రెడ్డి

ABN , First Publish Date - 2021-12-16T21:25:20+05:30 IST

జీవో 317 ప్రకారం సీనియారిటీ ప్రాతిపదికన ఉద్యోగాల ట్రాన్స్‌ఫర్లు ఇబ్బందికరంగా ఉన్నాయని మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి అన్నారు.

జీవో 317 అమలుపై ప్రభుత్వం పునరాలోచించాలి: రాంరెడ్డి దామోదర్‌రెడ్డి

సూర్యాపేట: జీవో 317 ప్రకారం సీనియారిటీ ప్రాతిపదికన ఉద్యోగాల ట్రాన్స్‌ఫర్లు ఇబ్బందికరంగా ఉన్నాయని మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విద్యా సంవత్సరం ప్రారంభం అయ్యాక ట్రాన్స్‌‌ఫర్లు చేస్తే ఎలా అని ప్రశ్నించారు. ఒక వారంలో బదిలీల అమలు అన్యాయమన్నారు. జీవో 317 అమలుపై ప్రభుత్వం పునరాలోచించాలని చెప్పారు. ప్రభుత్వానికి ఎన్ని విన్నపాలు చేసిన పెడచెవిన పెడుతోందని మండిపడ్డారు. స్థానికంగా ఉన్న ఉద్యోగులను ఇక్కడే ఉంచాలని సూచించారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి విరుద్ధంగా ఉద్యోగుల బదిలీలు ఉన్నాయన్నారు. ఉద్యోగుల వినతులను పరిగణనలోకి తీసుకుని బదిలీలు చేపట్టాలని కోరారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి బదిలీల విషయం తన చేతుల్లో లేదనడం ఆక్షేపణీయమని రాంరెడ్డి దామోదర్‌రెడ్డి తెలిపారు. 

Updated Date - 2021-12-16T21:25:20+05:30 IST