కరోనా వ్యాప్తి చెందకుండా ప్రజలను రమేష్కుమార్ కాపాడారు: ఉమ
ABN , First Publish Date - 2020-04-11T00:59:07+05:30 IST
కరోనా వ్యాప్తి చెందకుండా ప్రజలను రాష్ట్ర ఎన్నికల అధికారి రమేష్కుమార్ కాపాడారని టీడీపీ నేత బోండా ఉమ తెలిపారు. సుప్రీంకోర్టు కూడా రమేష్ కుమార్ నిర్ణయాన్ని ఆమోదించిందన్నారు.
విజయవాడ: కరోనా వ్యాప్తి చెందకుండా ప్రజలను రాష్ట్ర ఎన్నికల అధికారి రమేష్కుమార్ కాపాడారని టీడీపీ నేత బోండా ఉమ తెలిపారు. సుప్రీంకోర్టు కూడా రమేష్ కుమార్ నిర్ణయాన్ని ఆమోదించిందన్నారు. స్థానిక ఎన్నికల వాయిదాతో సీఎం జగన్ అహం దెబ్బతిందని, వైసీపీ ప్రభుత్వం తనకు లేని అధికారాలతో రమేష్పై దొంగ దెబ్బ తీసిందని మండిపడ్డారు. జగన్కు తాను అనుకున్నది జరగాలనే మూర్ఖత్వం తప్ప.. ప్రజల యోగ క్షేమాలు పట్టవని బోండా ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు.