మే15 వరకు రామప్ప ఆలయం మూసివేత
ABN , First Publish Date - 2021-04-17T05:37:57+05:30 IST
మే15 వరకు రామప్ప ఆలయం మూసివేత
వెంకటాపూర్ (రామప్ప), ఏప్రిల్ 16 : ములుగు జిల్లా వెంకటాపూర్ (రామప్ప) మండలంలోని పాలంపేటలో ఉన్న రామప్ప రామలింగేశ్వరస్వామి ఆలయాన్ని ఈనెల 17వ తేదీ నుంచి మే 15 వరకు మూసివేస్తున్నట్లు ప్రధాన అర్చకుడు హరీశ్శర్మ శుక్రవారం తెలిపారు. కరోనా సెకండ్వేవ్ ఉధృతి రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో పురావస్తుశాఖ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. స్వామివారికి రోజూ జరిగే నిత్యపూజలు యధాతథంగా కొనసాగుతాయని, భక్తులకు అనుమతిలేదని తెలిపారు. ఈ విషయాన్ని భక్తులు, పర్యాటకులు గమనించాలని, కరోనా వైరస్ ఉధృతి తగ్గిన తర్వాత దర్శనాలు ఉంటాయని అన్నారు.