రమణ దీక్షితులుకు చేదు అనుభవం

ABN , First Publish Date - 2020-09-24T00:27:26+05:30 IST

ఇక శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన అధ్యక్షుడు రమణ దీక్షితులకు చేదు అనుభవం ఎదురైంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీకి అనుగుణంగా..

రమణ దీక్షితులుకు చేదు అనుభవం

ఇక శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన అధ్యక్షుడు రమణ దీక్షితులుకు చేదు అనుభవం ఎదురైంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీకి అనుగుణంగా శ్రీవారి ఆలయంలో వంశపారంపర్య అర్చకుల వ్యవస్థను పునరుద్ధరించాలని రమణ దీక్షితులు పలువురు అర్చకులతో కలిసి పద్మావతి అతిథి గృహం వద్దకు చేరుకున్నారు. జగన్ అక్కడికి రాగానే ఇదే విషయమై రమణదీక్షితులు ప్రస్తావించారు. ఈ రాత్రికి చర్చిస్తామంటూ దీక్షితులకు చెప్పి జగన్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో నిరాశగా రమణ దీక్షితులు అక్కడి నుంచి వెనుదిరిగారు. 

Updated Date - 2020-09-24T00:27:26+05:30 IST