టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్
ABN , First Publish Date - 2020-10-01T00:43:10+05:30 IST
ఐపీఎల్ 2020లో భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరుగుతున్న...
దుబాయ్: ఐపీఎల్ 2020లో భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరుగుతున్న రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ కోల్కత్తా నైట్రైడర్స్ మ్యాచ్లో రాజస్థాన్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఆడిన రెండు మ్యాచ్లు గెలిచి 4 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న రాజస్థాన్ జట్టు ఈ మ్యాచ్ను కూడా సొంతం చేసుకోవాలని చూస్తోంది.
రెండు మ్యాచ్ల్లో ఒక మ్యాచ్ గెలిచి మరో మ్యాచ్లో ఓడిన నైట్రైడర్స్ ఈ మ్యాచ్లో గెలిచి సత్తా చాటాలని పట్టుదలతో ఉంది. రాజస్థాన్ రాయల్స్లో రాహుల్ తెవాటియా మంచి ఫామ్లో ఉండటం జట్టుకు కలిసొచ్చే అంశం. ఈ మ్యాచ్లో రెండు టీమ్స్ ఎలాంటి మార్పుల్లేకుండానే బరిలోకి దిగుతున్నాయి.