Qualifier 2: హై టెన్షన్ మ్యాచ్లో టాస్ గెలిచిన రాజస్థాన్
ABN , First Publish Date - 2022-05-28T00:45:06+05:30 IST
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో మరో కీలక సమరానికి రంగం సిద్ధమైంది. సెమీ ఫైనల్ లాంటి క్వాలిఫయర్ 2
అహ్మదాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో మరో కీలక సమరానికి రంగం సిద్ధమైంది. సెమీ ఫైనల్ లాంటి క్వాలిఫయర్ 2 మ్యాచ్లో తేల్చుకునేందుకు రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals)- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) సిద్ధమయ్యాయి. టాస్ గెలిచిన రాజస్థాన్ మరో మాటకు తావులేకుండా బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో విజయం సాధించిన జట్టు గుజరాత్ టైటాన్స్తో టైటిల్ పోరులో తలపడుతుంది. కాబట్టి ఇరు జట్లకు ఇది కీలక మ్యాచ్. క్వాలిఫయర్లో 1లో గుజరాత్ చేతిలో ఓడిన రాజస్థాన్ కసిగా ఉంది. బెంగళూరును చిత్తు చేసి ఫైనల్కు వెళ్లి గుజరాత్పై ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది.
మరోవైపు, కలిసొచ్చిన అదృష్టాన్ని చక్కగా వినియోగించుకోవాలని బెంగళూరు భావిస్తోంది. ఢిల్లీ కేపిటల్స్ ఓటమితో ప్లే ఆఫ్స్లోకి ప్రవేశించిన బెంగళూరు ఎలిమినేటర్ మ్యాచ్లో లక్నోను చిత్తుచేసి ఆత్మవిశ్వాసంతో ఉంది. ఇక్కడి వరకు వచ్చిన బెంగళూరు ట్రోఫీని సాధించి ఏళ్ల తరబడి ఎదురుచూపులకు ఫుల్స్టాప్ పెట్టాలని భావిస్తోంది. కాబట్టి ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. ఈ మ్యాచ్లో ఇరు జట్లు ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్నాయి.