IPL Final Day: టైటాన్స్‌పై టాస్ నెగ్గిన రాజస్థాన్ రాయల్స్

ABN , First Publish Date - 2022-05-30T01:13:06+05:30 IST

మార్చి 26న ప్రారంభమైన ఐపీఎల్ నేటితో ముగియనుంది. రెండు నెలలపాటు అభిమానులను ఉర్రూతలూగించిన

IPL Final Day: టైటాన్స్‌పై టాస్ నెగ్గిన రాజస్థాన్ రాయల్స్

అహ్మదాబాద్:  మార్చి 26న ప్రారంభమైన ఐపీఎల్ నేటితో ముగియనుంది. రెండు నెలలపాటు అభిమానులను ఉర్రూతలూగించిన ఐపీఎల్ సంబరానికి నేటితో ఫుల్‌స్టాప్ పడనుంది. మరికాసేపట్లో గుజరాత్ టైటాన్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. 


సమవుజ్జీలుగా ఉన్న ఈ రెండు జట్ల మధ్య నేటి మ్యాచ్ అభిమానులకు అసలైన మజా పంచనుంది. రాజస్థాన్ ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతుండగా, గుజరాత్ టైటాన్స్ జట్టులో మాత్రం ఒక మార్పు చోటుచేసుకుంది. అల్జారీ జోసెఫ్ స్థానంలో  లాకీ ఫెర్గ్యూసన్ జట్టులోకి వచ్చాడు.


టాస్‌కు ముందు దాదాపు గంటన్నరపాటు సాగిన ముగింపు వేడుకలు అభిమానులను ఉర్రూతలూగించాయి. బాలీవుడ్ స్టార్ హీరో రణ‌వీర్ సింగ్ పలు హిందీ పాటలతోపాటు ఆర్ఆర్ఆర్ సినిమాలోని ‘నాటు నాటు నాటు..’ పాటకు డ్యాన్స్‌లేసి ప్రేక్షకులను ఉత్సాహపరిచాడు. అలాగే, మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా, ప్రముఖ గాయని నీతి మోహన్ తన బృందంతో పలు హిట్ పాటలు పాడి అలరించారు.

Updated Date - 2022-05-30T01:13:06+05:30 IST