రాజమండ్రి సెంట్రల్ జైలులో మరో పది మంది ఖైదీలకు కరోనా

ABN , First Publish Date - 2020-08-08T16:08:11+05:30 IST

రాజమండ్రి సెంట్రల్ జైలులో ఖైదీలను కరోనా వెంటాడుతోంది.

రాజమండ్రి సెంట్రల్ జైలులో మరో పది మంది ఖైదీలకు కరోనా

రాజమండ్రి: రాజమండ్రి సెంట్రల్ జైలులో ఖైదీలను కరోనా వైరస్ వెంటాడుతోంది. కొత్తగా మరో పది మంది ఖైదీలకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇప్పటి వరకు  275 మంది ఖైదీలకు కరోనా సోకింది. 32 మంది జైలు సిబ్బంది కరోనా బారిన పడ్డారు. జైలులో 1675 మంది ఖైదీల్లో ఇప్పటివరకు 275 మందికి కరోనా సోకడంతో అధికారులు, ఖైదీల్లో భయాందోళన నెలకొంది. కరోనా సోకిన వారికి భద్రతా కారణాల రీత్యా కోవిడ్ ఆసుపత్రులకు తరలించకుండా జైలులోనే కరోనా చికిత్సను అందజేస్తున్నారు.

Updated Date - 2020-08-08T16:08:11+05:30 IST