చలో విజయవాడపై రాజమండ్రిలో పోలీసుల ఆంక్షలు
ABN , First Publish Date - 2022-02-03T14:10:58+05:30 IST
చలో విజయవాడపై రాజమండ్రిలో పోలీసుల ఆంక్షలు విధించారు.
రాజమండ్రి: చలో విజయవాడపై రాజమండ్రిలో పోలీసుల ఆంక్షలు విధించారు. ఉద్యోగులు విజయవాడ వెళ్ళకుండా అడ్డుకునేందుకు అన్ని ప్రాంతాల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. కోటిపల్లి బస్టాండు, రైల్వే స్టేషన్, రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్, ఆర్.టి.సి బస్ స్టాండ్, దవళేశ్వరంల వద్ద చెక్ పోస్ట్లు పెట్టారు. రాత్రి నుంచి చెక్ పోస్టుల వద్ద పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.