రాజమండ్రి: భారీ వర్షాలతో పొంగి ప్రవహిస్తున్న శబరి
ABN , First Publish Date - 2020-08-15T15:12:26+05:30 IST
ఎడతెరిపి లేని వర్షాలతో శబరి నది పొంగి ప్రవహిస్తోంది. చింతూరు వద్ద శబరి నీటి మట్టం 36.8 అడుగులకు పెరిగింది.
రాజమండ్రి: ఎడతెరిపి లేని వర్షాలతో శబరి నది పొంగి ప్రవహిస్తోంది. చింతూరు వద్ద శబరి నీటి మట్టం 36.8 అడుగులకు పెరిగింది. అటు కూనవరం వద్ద గోదావరి నీటిమట్టం 17.69 మీటర్లకు పెరిగింది. చింతూరు మండలం చట్టి వద్ద జాతీయ రహదారిపైకి వరద నీరు వచ్చిచేరడంతో చత్తీస్గఢ్ వైపు రాకపోకలు నిలిచిపోయాయి.