గాలివాన బీభత్సం
ABN , First Publish Date - 2022-04-07T00:57:09+05:30 IST
వికారాబాద్ జిల్లా ధారూరు మండల కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో బుధవారం సాయంత్రం గాలివాన దుమారం రేపింది.
వికారాబాద్: వికారాబాద్ జిల్లా ధారూరు మండల కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో బుధవారం సాయంత్రం గాలివాన దుమారం రేపింది. ఆకాశం మేఘావృతమై ఉరుములు, మెరుపుతో వర్షం కురిసింది. దీంతో గాలివాన ధాటికి ధారూరు-తాండూర్ రోడ్డుపై ఆశాపుర ఫ్యాక్టరీ ఎదుట రోడ్డు పక్కన గల మూడు చెట్లు నేలకొరిగాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే వచ్చి రోడ్డు పైనుంచి వాటిని తొలగింపజేశారు. అదేవిధంగా ధారూరు సమీపంలో గల ఓ కూరగాయల నర్సరీపైన వేసిన షేడ్నెట్ పైభాగం గాలికి లేచిపోగా, ఆ పక్కనే ఉన్న షెడ్డు పైరేకులు గాలికి లే చి దూరంగా ఎగిరిపడ్డాయి. విద్యుత్ తీగలు తెగిపడి రోడ్డుపై పడ్డాయి. గాలివానకు విద్యుత్ సరఫరా నిలిచిపోయి అంధకారం అలుముకుంది.