ఈ నెలాఖరులో తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన
ABN , First Publish Date - 2022-04-09T00:00:14+05:30 IST
కాంగ్రెస్ ముఖ్య నేతలతో రేవంత్రెడ్డి సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు.
హైదరాబాద్: కాంగ్రెస్ ముఖ్య నేతలతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ధాన్యం కొనుగోలుపై భవిష్యత్ ఉద్యమ కార్యచరణ.. ఇటీవల కాంగ్రెస్ చేపట్టిన ఆందోళనలపై సమీక్ష చేశారు. ఈ సందర్భంగా రేవంత్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఏప్రిల్ నెలాఖరులో తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన ఉంటుందని చెప్పారు.రాహుల్ పర్యటన జరిగేలోపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ప్రజా సమస్యలపై పోరాటాలు కొనసాగిద్దామన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు ప్రారంభం అయ్యాయని తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ, టీఆర్ఎస్లు ఒకరిపై ఒకరు పోరాటాలు చేస్తున్నట్టు నటిస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. ఈ విషయాలపై వారి రాజకీయ నాటకాలు బయటపెడుతూ ప్రజలకు తెలియజెప్పే విధంగా మనం ప్రజల మధ్య పోరాటాలు కొనసాగించాలని రేవంత్రెడ్డి పేర్కొన్నారు. ఈ సమావేశానికి షబ్బీర్ అలీ, కొండా సురేఖ, చిన్నారెడ్డి, ఏలేటి మహేశ్వర్రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, రామ్మోహన్రెడ్డి, తదితరులు హాజరయ్యారు.