రాహుల్ హత్యకేసులో మరో నలుగురు అరెస్ట్
ABN , First Publish Date - 2021-08-29T23:39:16+05:30 IST
పారిశ్రామిక వేత్త రాహుల్ హత్యకేసులో మరో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీనాథ్, బాబూరావు, రాజాబాబు, రమేష్లను పోలీసులు అరెస్ట్ చేశారు.
విజయవాడ: పారిశ్రామిక వేత్త రాహుల్ హత్యకేసులో మరో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీనాథ్, బాబూరావు, రాజాబాబు, రమేష్లను పోలీసులు అరెస్ట్ చేశారు. రాహుల్ హత్యకేసులో ఇప్పటివరకు 11 మంది అరెస్ట్ చేశారు. కోరాడ విజయ్, కోగంటి సత్యంకు చెందిన రెండు వ్యాపార సంస్థలను పోలీసులు సీజ్ చేశారు. ఈ కేసులో ఏ-1గా కోరాడ విజయ్కుమార్, ఏ-2గా కోరాడ పద్మజ, ఏ-3గా గాయత్రి, ఏ-4గా కోగంటి సత్యం పేర్లను చేర్చారు. ఇప్పుడు ఆన్లైన్(దర్యాప్తు తర్వాత)లో అందుబాటులో ఉంచిన ఎఫ్ఐఆర్లో ఏ-1గా కోరాడ విజయ్కుమార్, ఏ-2గా కోగంటి సత్యం, ఏ-3గా కోరాడ పద్మజ, ఏ-4గా పద్మజ, ఏ-5గా గాయత్రి పేర్లను చేర్చారు. ఎక్స్ప్రెస్ ఎఫ్ఐఆర్లో నలుగురి పేర్లు ఉండగా, ఆన్లైన్లో ఉంచిన ఎఫ్ఐఆర్లో ఐదుగురి పేర్లను చేర్చడం గమనార్హం.