ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శితో రఘురామ భేటీ
ABN , First Publish Date - 2021-03-31T00:42:19+05:30 IST
ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసాబలేతో.. వైసీపీ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు మంగళవారం భేటీ అయ్యారు.
ఢిల్లీ: ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసాబలేతో.. వైసీపీ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు మంగళవారం భేటీ అయ్యారు. మతమార్పిడులు, దేవాదాలయాల మీద జరుగుతున్న దాడులపై వారు చర్చించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసినందున తన నియోజకవర్గానికి కూడా వెళ్లనివ్వకుండా అడ్డుపడుతున్నారని దత్తాత్రేయకి రఘురామకృష్ణరాజు వివరించారు. ఆర్ఎస్ఎస్ విభాగం ధర్మజాగరణ్తో కలిసి.. సనాతన స్వదేశీ సేన కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉందని ఎంపీ రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు.