జనాలను చూసి జగన్ వణికిపోవడం ఏంటి?..: ఎంపీ రఘురామ
ABN , First Publish Date - 2022-02-10T21:18:10+05:30 IST
జనాలను చూసి సీఎం జగన్ వణికిపోవడం ఏంటని ఎంపీ రఘురామ కృష్ణం రాజు ప్రశ్నించారు.
న్యూఢిల్లీ: జనాలను చూసి సీఎం జగన్ వణికిపోవడం ఏంటి? ఒకప్పుడు జనాలు అంటే ఆయనకు మ్యానియా... ఇప్పుడు ఆయన వస్తే దారి పొడువునా షాపులు బంద్ చేయడం.. గంటల తరబడి ట్రాఫిక్ నిలిపివేయడం ఏంటని ఎంపీ రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఇంట్లో ఉంటే జనాలు ఆనందిస్తారని, ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు ఉండవన్నారు. ప్రభుత్వం పెట్టె రూ. 40 రూపాయల సినిమా టికెట్టుకు కంప్యూటర్ వాడాలి, ఈ పే చేయాలి.. మరి మద్యానికి మాత్రం క్యాష్ కలెక్షన్ ఎందుకు, ఎవరైనా డబ్బులు నొక్కేస్తున్నారా? అని రఘురామ ప్రశ్నించారు.