ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని చెప్పక తప్పదు: రఘురామ

ABN , First Publish Date - 2022-01-19T16:11:57+05:30 IST

ఉద్యోగుల పీఆర్‌సీ, ఐఆర్ అంశంలో ప్రభుత్వ ఉద్యోగులకు తమ ప్రభుత్వం చేసిన అన్యాయానికి నిరసనగా ఒక్కరోజు ఉపవాస దీక్ష చేపట్టానని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు.

ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని చెప్పక తప్పదు: రఘురామ

ఢిల్లీ : ఉద్యోగుల పీఆర్‌సీ, ఐఆర్ అంశంలో ప్రభుత్వ ఉద్యోగులకు తమ ప్రభుత్వం చేసిన అన్యాయానికి నిరసనగా ఒక్కరోజు ఉపవాస దీక్ష చేపట్టానని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు. నేడు ఢిల్లీలోని తమ నివాసంలో ఆయన ఉపవాస దీక్షకు పూనుకున్నారు.ఈ సందర్భంగా రఘురామ మాట్లాడుతూ.. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు దీక్ష నిర్వహించనున్నట్టు తెలిపారు. ఉద్యోగులకు జరిగిన అన్యాయానికి మద్దతుగా దీక్ష చేస్తున్నానన్నారు. ఉద్యోగులకు ఎన్నో చేస్తామని ఎన్నికల్లో కూడా వాగ్దానాలు ఇచ్చామని రఘురామ గుర్తు చేశారు. ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని చెప్పక తప్పదన్నారు. కొంతమంది ఉద్యోగులకు ఇలానే జరగాలని తప్పుగా మాట్లాడుతున్నారన్నారు. ఎంతోమందికి విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులకు ఏం వస్తుందని... వారు లంచాలు ఎలా తీసుకుంటారని రఘురామ ప్రశ్నించారు. మాట తప్పను, మడమ తిప్పను అని జగన్ చెప్పారని గుర్తు చేశారు. ప్రజలందరూ ముక్తకంఠంతో ఎదురు తిరగాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులుకు జరిగిన అన్యాయాన్ని ప్రతిఘటించాలని రఘురామ సూచించారు.

Updated Date - 2022-01-19T16:11:57+05:30 IST