జగన్ అక్రమాస్తుల కేసులపై హైకోర్టులో రఘురామ పిల్
ABN , First Publish Date - 2021-07-04T01:06:02+05:30 IST
ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులపై హైకోర్టులో ఎంపీ రఘురామ పిల్ దాఖలు
హైదరాబాద్: ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులపై హైకోర్టులో ఎంపీ రఘురామ పిల్ దాఖలు చేశారు. జగన్ అక్రమాస్తుల కేసులను సీబీఐ, ఈడీ సరిగా దర్యాప్తు చేయడం లేదని పిల్లో ఆయన పేర్కొన్నారు. దర్యాప్తులో బయటకొచ్చిన అంశాలను వదిలిపెట్టాయని రఘురామ ఆరోపించారు. కేసులకు ముగింపు ఇవ్వడంలో సీబీఐ, ఈడీ విఫలమయ్యాయని ఆయన వెల్లడించారు. అన్ని అంశాలను దర్యాప్తు చేసేలా సీబీఐ, ఈడీని ఆదేశించాలని పిల్లో రఘురామ కోరారు.