రాజన్న రాజ్యం‌ కోసం షర్మిల ఏపీలో పోరాడాలి: రఘురామ

ABN , First Publish Date - 2021-04-03T22:25:48+05:30 IST

రాజన్న రాజ్యం‌ కోసం వైఎస్ షర్మిల ఏపీలో పోరాడాలని ఎంపీ రఘురామకృష్ణరాజు సూచించారు. మాజీమంత్రి వివేకా

రాజన్న రాజ్యం‌ కోసం షర్మిల ఏపీలో పోరాడాలి: రఘురామ

అమరావతి: రాజన్న రాజ్యం‌ కోసం వైఎస్ షర్మిల ఏపీలో పోరాడాలని ఎంపీ రఘురామకృష్ణరాజు సూచించారు. మాజీమంత్రి వివేకా హత్య కేసులో ఇంటి దొంగలెవరో తమ ప్రభుత్వం తేల్చాలని డిమాండ్ చేశారు. వివేకా కుమార్తె ఒంటరి పోరాటం చేస్తున్నారని, ప్రతిపక్ష నాయకుడిగా సీబీఐ విచారణ డిమాండ్‌ చేసిన జగన్.. ఇప్పుడెందుకు మాట్లాడటం లేదు? అని రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు. సీఐడీ విచారణకు ఆదేశించినా పురోగతి శూన్యమని తప్పుబట్టారు. శవానికి కుట్లు వేసిన ఘటన గతంలో ఎప్పుడూ జరగలేదని రఘురామకృష్ణరాజు చెప్పారు.

Updated Date - 2021-04-03T22:25:48+05:30 IST