ఆఖరి స్థానంలో ఎలా ఉన్నాం?: రఘురామ
ABN , First Publish Date - 2021-09-14T22:00:32+05:30 IST
ఆంధ్రప్రదేశ్లో టీకాలు వేయడంలో ఏపీ ముందుందని ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారని రఘురామ కృష్ణం అన్నారు.
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో టీకాలు వేయడంలో ఏపీ ముందుందని ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారని రఘురామ కృష్ణంరాజు అన్నారు. దీనిపై స్పందించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ వ్యాక్సినేషన్ కార్యక్రమం ఉద్యమంలా చేపట్టామని విజయసాయి చెబుతున్నారని, టీకా అంతగా సరఫరా చేస్తే ఏపీ ఆఖరి స్థానంలో ఎందుకు ఉందని ప్రశ్నించారు. ఈ విషయంపై ఆయన ఆలోచించాలని రఘురామ అన్నారు.
సాదాసీద జీవితం అని చెప్పిన విజయసాయిరెడ్డి ఇవాళ ఉదయం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వచ్చినట్లు తెలిసిందని రఘురామ అన్నారు. ఆయన సొంత డబ్బులతో ప్రత్యేక విమానంలో వస్తే కనీసం రూ. 15 లక్షలు అవుతుందని, ఆ డబ్బు ఎవరు కట్టారని ప్రశ్నించారు. ఆయనకు నెలకు వచ్చే రూ. లక్షన్నరతో ప్రత్యేక విమానంలో ఎలా ప్రయాణించగలరన్నారు. ప్రభుత్వ డబ్బుతో ఎంపీని ప్రత్యేక విమానంలో ఢిల్లీకి పంపించారా?.. సీఎం జగన్ ఆలోచించాలని రఘురామ అన్నారు.