విజయసాయిరెడ్డిపై రఘురామ సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2021-07-15T22:57:35+05:30 IST

ఎంపీ విజయసాయిరెడ్డిపై ఎంపీ రఘురామకృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయసాయిరెడ్డి త్వరలోనే అంతర్జాతీయ

విజయసాయిరెడ్డిపై రఘురామ సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీ: ఎంపీ విజయసాయిరెడ్డిపై ఎంపీ రఘురామకృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయసాయిరెడ్డి త్వరలోనే అంతర్జాతీయ కార్యదర్శి అవుతాడేమో చూడాలని ఎద్దేవాచేశారు. రామాయణంలో మందర, శకుని పాత్ర విజయసాయిరెడ్డిదని తప్పుబట్టారు. ‘‘దొంగలెక్కలు వేయడంలో విజయసాయి ఘనాపాటి. స్థాయి గురించి మాట్లాడే అర్హత విజయసాయిరెడ్డికి లేదు. పిచ్చోడి చేతిలో రాయిలా సెక్షన్‌ 124 మారిందని సీజేఐ అన్నారు. ఎవరిది ఏ కులం, ఏ వంశం అనేదానిపై చర్చకు సిద్ధం. తలకాయ ఉన్నవాడిని ఒక్కడిని పెట్టుకోమని.. సీఎం జగన్ గారికి సూచిస్తున్నాను. ఎన్నుకున్న ప్రభుత్వాలు ప్రజలకు న్యాయం చేయాలి. కానీ న్యాయస్థానాలు ప్రజలకు న్యాయం చేస్తున్నాయి’’ రఘురామకృష్ణరాజు తెలిపారు. 



Updated Date - 2021-07-15T22:57:35+05:30 IST