మహారాణికీ తప్పని మహమ్మారి.. !

ABN , First Publish Date - 2022-02-21T00:40:13+05:30 IST

బ్రిటన్ రాణి ఎలిజెబెత్ కరోనా బారిన పడ్డారు. బకింగ్‌హామ్ ప్యాలెస్ ఈ విషయాన్ని తాజాగా ఓ ప్రకటనలో తెలిపింది. అయితే.. రాణి ఎలిజెబెత్‌కు జలుబు లాంటి లక్షణాలు స్వల్ప స్థాయిలో ఉన్నట్టు ప్యాలెస్ అధికారులు పేర్కొన్నారు

మహారాణికీ తప్పని మహమ్మారి.. !

ఇంటర్నెట్ డెస్క్: బ్రిటన్ రాణి ఎలిజబెత్(95) కరోనా బారిన పడ్డారు. బకింగ్‌హామ్ ప్యాలెస్ ఈ విషయాన్ని తాజాగా ఓ ప్రకటనలో తెలిపింది. అయితే.. రాణి ఎలిజబెత్‌కు జలుబు లక్షణాలు స్వల్ప స్థాయిలో ఉన్నట్టు ప్యాలెస్ అధికారులు పేర్కొన్నారు. కొద్ది వారాల క్రితమే.. రాణి పెద్ద కుమారుడు ప్రిన్స్ చార్లెస్ కూడా కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. రాకుమారుడికి డైరెక్ట్ కాంటాక్ట్‌లోకి వచ్చిన కారణంగానే రాణికి కరోనా సోకినట్టు తెలుస్తోంది. ఇక కరోనా చికిత్సకు సంబంధించి ప్రస్తుతమున్న ప్రామాణిక మార్గదర్శకాల ప్రకారం రాణి ఎలిజెబెత్‌కు వైద్యం కొనసాగిస్తున్నారు. అయితే.. బ్రిటన్ రాణి స్వల్ప స్థాయిలో అధికారిక బాధ్యతలు నిర్వహిస్తారని కూడా తమ ప్రకటనలో ప్యాలెస్ అధికారులు పేర్కొన్నారు. కాగా.. అత్యధిక కాలం పాటు( 70 ఏళ్లు) బ్రిటన్ సింహాసనంపై కొనసాగుతున్న పాలకురాలిగా బ్రిటన్ రాణి.. రికార్డు సృష్టించారు. ఆమె రెండు డోసుల కరోనా టీకాతో పాటూ బూస్టర్ డోసు కూడా తీసుకున్నారు.

Updated Date - 2022-02-21T00:40:13+05:30 IST