RRR విషయంలో సీబీసీఐడీ సునీల్‌‌కు బిగుస్తున్న ఉచ్చు

ABN , First Publish Date - 2021-07-26T22:13:26+05:30 IST

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం విషయంలో సీబీసీఐడీ ఏడీజీ సునీల్‌కుమార్‌కు ఉచ్చు బిగుస్తోంది...

RRR విషయంలో సీబీసీఐడీ సునీల్‌‌కు బిగుస్తున్న ఉచ్చు

న్యూ ఢిల్లీ/అమరావతి : వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం విషయంలో సీబీసీఐడీ ఏడీజీ సునీల్‌కుమార్‌కు ఉచ్చు బిగుస్తోంది. సునీల్‌పై చర్యలు తీసుకోవాలంటూ డీఓపీటీ శాఖ మంత్రి జితేంద్రసింగ్‌కు రఘురామ లేఖ రాసిన విషయం తెలిసిందే. ఆ లేఖను జితేంద్రసింగ్ హోంశాఖకు పంపారు. హిందూ మత వ్యతిరేక ప్రచారం చేస్తున్నారంటూ సునీల్‌కుమార్‌పై కేసు నమోదు చేయాలని ఢిల్లీ పార్లమెంట్ స్ట్రీట్‌లో ఎంపీ ఫిర్యాదు చేశారు. సునీల్‌కుమార్‌ సర్వీస్ నిబంధనలకు విరుద్ధంగా మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ఫిర్యాదులో రఘురామ పేర్కొన్నారు. సునీల్‌కుమార్‌పై హోంశాఖ నిర్ణయం తీసుకోవాలని ఆ శాఖ కార్యదర్శికి ఎంపీ ఫిర్యాదును కేంద్రమంత్రి పంపారు. హోంశాఖ కార్యదర్శికి పంపిన లేఖ కాపీని రఘురామకు కూడా కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ పంపారు. సునీల్‌పై హోం శాఖ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Updated Date - 2021-07-26T22:13:26+05:30 IST